Breaking News

కరోనా భాదిత ఢిల్లీ జర్నలిస్టులకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సహాయం

 


డిల్లీలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ర్ట జర్నలిస్టులకు రాష్ర్ట ప్రభుత్వం ఆర్థిక సహాయం అంద చేసింది. డిల్లీ కేంద్రంగా పనిచేసే ముగ్గురు తెలంగాణ ప్రాంత జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ జరిగింది. వీరికి ఆసుత్రులో చికిత్స జరుగుతోంది. మరో ఏడుగురు జర్నలిస్టులను క్వారెంటైన్ లో ఉంచారు. జర్నలిస్టులకు తక్షణ సహాయం  ఆసుపత్రుల్లో టెస్టుల కోసం రూ 12 లక్షల రూపాయలు ప్రభుత్వం అంద చేసింది. పాజిటివ్ కరోనా భాదితులకు ఒక్కొక్కరికి రూ 75 వేల చొప్పున ఆర్థిక అఁద చేసారు. తెలంగాణ జర్నలిస్టుల ఆరోగ్య స్థితి గతులను  తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ స్వయంగా ఎప్పటి కప్పుడు తెల్సుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

జర్నలిస్టుల ఆరోగ్య స్థితి గతులను మంత్రి కెటిఆర్ సహా ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తదితరులు ఎప్పటి కప్పుడు తెల్సుకుంటున్నారు.

No comments